30, జనవరి 2011, ఆదివారం

వసుధమాట.

వేలగొంతుకలు ఒక్క స్వరపేటికలో చేరి అరుస్తూ నేవున్నా గుండె వాటిగొంతు నొక్కు తూనే ఉంది .బుద్ధి నీకై మరలమని మొర పెడుతూనే వున్నా హృదయం వద్దని బుజ్జగిస్తునే వుంది .జ్ఞానం తన నేత్రం తెరిచి నిను కాంచ మంటున్నా మోహం పొరలు కప్పి ఆపుతోనే వుంటుంది . నినుపలకని స్వరం,నిను ఊహించని బుద్ధి,నిను కాంచని నేత్రం ,వ్యర్థమని ఆత్మ లోలోపల ఘోషిస్తూనే వుంటుంది . ఈ విరుద్ధ భావాల అంతర్ మధనం నాలో ఇమడలేక సతమత మవుతుంది . వీటినుంచి నను కడతేర్చే నాదునివి నీవే నని తెలిసినా అహం వీడి ప్రార్ధించ లేని మూర్ఖత్వము నాది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి