19, డిసెంబర్ 2010, ఆదివారం

వసుధమాట.

అపుడు నేను శబరిని, నీవు రాముడివి.అపుడు నేను కుచేలుడిని,నీవు నా చెలికాడవు.అపుడు నేను రాధను,నీవు నా ప్రేమికుడవు.నేను అర్జునుని,నీవు నా హితునివి.నేను హనుమంతుని,నీవు నా స్వామివి.ప్రతిజన్మలోను భువనాంత రాళాలు దద్దరిల్లే కీర్తి శిఖ నీవు.అతిసామాన్యము నేను.ఈ అల్పత్వానికి నిను పొందే అర్హతేమిటని? ప్రతిసారి అందరికీ ఆశ్చర్యమే.నిను తెలుసుకోవటమే నన్ను నీ దగ్గరికి చేర్చే సూత్రమని వారికి తెలీదు.వారిప్రయత్నమంతా డంబచారలతో నిన్ను పొందాలని,శాకపాకానికి,తులసీదళానికి నువ్వు సరితూగటం వారు జీర్ణించుకోలేరు.నిను కఠినాతుముని చేసి మరింత జటిలం చేయటమే వారి ద్యేయమనుకొంట.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి